Bollywood: బాలీవుడ్ హుషారు... విడుదల జోరు
‘సూర్యవంశీ’ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్ హుషారుగా అడుగులు వేస్తుంది. ఈ ఏడాది బుకింగులు అయిపోయాయి... వచ్చే ఏడాది కోసం చాలా చిత్రాలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.
‘సూర్యవంశీ’ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్ హుషారుగా అడుగులు వేస్తుంది. ఈ ఏడాది బుకింగులు అయిపోయాయి... వచ్చే ఏడాది కోసం చాలా చిత్రాలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ముందస్తుగానే విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. శనివారం పలు బృందాలు ఈ మార్గంలో నడిచాయి.
ఆమిర్ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ ఛద్దా’కు సంబంధించి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. ఆమిర్, కరీనా సన్నిహితంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆమిర్ యువకుడిగా, వయసుపై బడిన వాడిలా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ కారణంతోనే సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్గా వస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్14నే పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’, వరుణ్ధావన్ ‘భేడియా’ కూడా రానుంది. ప్రభాస్ ‘సలార్’ కూడా ఇదే రోజున రానుంది. సలార్, ‘కేజీఎఫ్’...ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో ‘సలార్’ విడుదల తేదీ మారే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
హిందీలో ‘హిట్’ కొట్టడానికి
తెలుగులో విజయం సాధించిన ‘హిట్’ చిత్రం అదే పేరుతో హిందీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలనుయే హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. రాజ్కుమార్రావ్, సాన్యా మల్హోత్ర జంటగా నటించారు. ఈ సినిమాని మే 20, 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భూషణ్కుమార్, దిల్రాజు, క్రిషన్ కుమార్, కులదీప్ రాథోర్ నిర్మిస్తున్నారు.
జుగ్ జుగ్ సందడి
వచ్చే ఏడాది కోసం కర్చీఫ్ వేసిన మరో చిత్రం ‘జుగ్ జుగ్ జీయో’. వరుణ్ ధావన్, అనిల్కపూర్, కియారా అడ్వాణీ, నీతూ కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 24న విడుదల చేయనున్నారు. ‘గుడ్న్యూస్’ దర్శకుడు రాజ్మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కుటుంబం, అనుబంధాల నేపథ్యంగా సాగే చిత్రమిది. ప్రేమ, తరాల మధ్య అంతరం అనే విషయాల్ని ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.