Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్తో రామ్ చరణ్ చెప్పిన సంగతులివే..!
ఎన్టీఆర్ ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానం చెబితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది? దాన్నే చూపించింది ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కార్యక్రమం. ఎన్టీఆర్ హోస్ట్గా ప్రసారమవుతున్న ఈ షోకి రామ్ చరణ్ గెస్ట్గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకి రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు. కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఆ విశేషాలివీ...
ఇంటర్నెట్ డెస్క్: ఎన్టీఆర్ ప్రశ్నలకు రామ్చరణ్ సమాధానం చెబితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది? దాన్నే చూపించింది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం. ఎన్టీఆర్ హోస్ట్గా ప్రసారమవుతున్న ఈ షోకు రామ్చరణ్ గెస్ట్గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్చరణ్ సమాధానం ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు. ఆ విశేషాలివీ...
కాజల్ పేరుతో ఇబ్బంది పడ్డా..
‘‘కుక్కలు పెంచుకోవడమంటే నాకెంతో ఇష్టం. ప్రస్తుతం నా దగ్గర 6 కుక్కలు ఉన్నాయి. వాటితోపాటు గుర్రాలను పెంచుకోవడం కూడా ఇష్టమే. నా దగ్గర ఉన్న గుర్రాలలో ఒక దాని పేరు బాద్ షా. ‘మగధీర’లో అది మీ అందరికీ కనిపిస్తుంది. అదే సినిమాలో మరో గుర్రాన్నీ చూపించారు. దాని పేరు కాజల్. నా స్నేహితుడు చనిపోయే ముందు ఆ గుర్రాన్ని నాకు ఇచ్చాడు. అది నాకు ఎంతో స్పెషల్. దాని కళ్లు చాలా నల్లగా, షార్ప్గా ఉంటాయి. అందుకే దాని పేరు కాజల్. ‘మగధీర’ కంటే ముందే అది నా దగ్గరకు వచ్చింది. అయితే మగధీర విడుదలయ్యాక హీరోయిన్ పేరు కూడా కాజలే కావడంతో నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది. (నవ్వులు)’’ అంటూ చెప్పుకొచ్చారు రామ్చరణ్.
ఆయన బాబాయ్.. సోదరుడు..
‘‘జీవితంలో కొన్ని బంధాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది తక్కువే అవుతుంది. కొందరితో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టకపోవడమే మంచిది. ఆ అనుబంధాలను బయటపెడితే దిష్టి తగులుతుందేమోనని నేను నమ్ముతాను. అలాంటి అనుబంధమే నాకు పవన్ బాబాయ్కు మధ్య ఉంది. అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి నేనే బయట ఎక్కువగా మాట్లాడను. నా చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు ఉన్న రిలేషన్ మాటల్లో చెప్పలేనిది. నాన్న షూటింగ్స్ లో బిజీగా ఉంటే అమ్మ కూడా ఆయనతో పాటు లొకేషన్కి వెళ్లేది. దాంతో బాబాయే మా ముగ్గుర్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవారు. ట్యూషన్స్లో సరిగ్గా చదువుకోకపోతే మమ్మల్ని మందలించేవారు. మేం పెద్దయ్యాకా నాన్న నాతో డైరెక్ట్గా చెప్పలేని ఎన్నో విషయాలను బాబాయ్ ద్వారా మాకు చెప్పించేవారు. ఆయన నాకో సోదరుడు, బాబాయ్, చిన్న తండ్రి’’ అంటూ పవన్తో అనుబంధాన్ని వివరించారు.
నేను ఎక్కువగా అదే చూస్తా
‘‘తారక్.. నువ్వు గురువు గారు.. గురువు గారు అంటున్నప్పుడల్లా నువ్వు నటించిన ‘అదుర్స్’ సినిమా గుర్తుకు వస్తోంది. ఆ సినిమా నాకెంతో నచ్చింది. నేను ఎన్నోసార్లు చూశాను. బాగా నవ్వుకున్నాను. అందులో నీ కామెడీ టైమింగ్, పంచ్లు అదుర్స్ అనిపించేలా ఉంటాయి. ఇప్పటికీ నాకు ఎప్పుడైనా డల్గా అనిపిస్తే వెంటనే ‘అదుర్స్’ చూస్తా’’
ఆచార్య.. స్కూల్ ప్రిన్సిపల్తో ఉన్నట్లు
‘‘సాధారణంగానే నాన్న సినిమా షూటింగ్స్కి వెళ్లినప్పుడు నేను ఫుల్ టెన్షన్ పడతాను. అలాంటిది ఆయనతో ‘ఆచార్య’ చేస్తున్నప్పుడు చాలా కంగారుగా అనిపించింది. సెట్లో ఆయన్ను చూసినప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్తో ఉన్నట్లు అనిపించింది. నా జీవితంలోనే కాకుండా నా కుటుంబం మొత్తానికీ ‘ఆచార్య’ ఎంతో స్పెషల్. నాన్నతో కలిసి స్క్రీన్ పంచుకోవడాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన మా డైరెక్టర్.. నీ డైరెక్టర్.. మన డైరెక్టర్ కొరటాల శివకు పెద్ద థ్యాంక్స్. కేవలం 15 నిమిషాల పాత్రగా ప్రారంభమైన సిద్ధ పాత్ర.. సుమారు ఓ ఫుల్ లెంగ్త్ పాత్రగా ఆయన తీర్చిదిద్దారు’’ అని రామ్ చరణ్ వివరించారు.
మేజిక్ చూడ్డానికి సిద్ధంగా ఉండండి
‘‘కొమురం భీమ్ పాత్రలో మీకు ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు ఉంటాయి. స్క్రీన్పై తారక్ని చూసి మీ అందరూ ఫిదా అయిపోతారు. ఆ మేజిక్ని నేను ఇప్పుడు చెప్పను. త్వరలో తప్పకుండా మీ అందరూ వెండితెరపై చూస్తారు’’ అంటూ ఎన్టీఆర్ పాత్రపై ఆసక్తిని రెట్టింపు చేశారు రామ్ చరణ్.
పూర్వజన్మ సుకృతం -తారక్
‘‘కొమురం భీమ్ పాత్రలో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ సినిమా షూట్లో మనం ఎంతో కష్టపడ్డాం. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమురంభీమ్గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా. అలాంటి గొప్ప పాత్రల్లో మనం నటించామంటే నిజంగా మన పూర్వజన్మసుకృతం’’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను పంచుకున్నారు ఎన్టీఆర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
రామ్తో వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు