ప్రభాస్ కోసం మరో నాయిక?
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె కాక ప్రత్యేక గీతం కోసం మరో నాయికను రంగంలోకి దింపనున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పటికే శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ చిత్రం కోసం ‘ఖిలాడీ’ భామ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శ్రుతితో పాటు మరో నాయిక పాత్రకు ప్రాధాన్యముందని, ఇప్పుడా పాత్ర కోసమే మీనాక్షిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్లో ఆమె చిత్ర బృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన మాస్, యాక్షన్ అడ్వంచరస్ చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. భువన్ గౌడ ఛాయాగ్రాహ కుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?