Runway 34: ‘రన్‌ వే 34’ చిత్రీకరణ పూర్తి

బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు అజయ్‌దేవగణ్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. అజయ్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రన్‌వే 34’ చిత్రీకరణ పూర్తైనట్లు శనివారం ప్రకటించారు. ఇందులో ఆయన పైలెట్‌గా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Updated : 19 Dec 2021 06:57 IST

బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు అజయ్‌దేవగణ్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. అజయ్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రన్‌వే 34’ చిత్రీకరణ పూర్తైనట్లు శనివారం ప్రకటించారు. ఇందులో ఆయన పైలెట్‌గా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చేఏడాది ఏప్రిల్‌ 29  ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ‘‘దీని చిత్రీకరణ పూర్తైంది. ఇక మిగిలిన పనులు చేసేసి ఎప్పుడు విడుదల చేద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని అజయ్‌ దేవగణ్‌ పేర్కొన్నారు. గతంలో ‘యు మీ ఔర్‌ హమ్‌’, ‘శివాయ్‌’ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. అజయ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని