Cinema news: బుల్లితెరపై సినీతారల జోరు.. వీక్షకుల్లో హుషారు
Tollywood: తెలుగులో సెలబ్రిటీలు చేస్తున్న రియాలిటీ షోలపై ఓ కథనం.
వెండితెరపై నీరాజనాలు అందుకునే అగ్రతారలు టీవీ షోల్లో సందడి చేస్తే వచ్చే కిక్కే వేరు. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ టీవీలకు అతుక్కునేలా చేయడంలో ఈ షోలు విజయవంతం అవుతున్నాయి. వెండితెర వేల్పులుగా వెలిగిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్లాంటి అగ్రహీరోలు ఈ టీవీ రియాలిటీ షోల్లో అదరగొట్టి కుటుంబ ప్రేక్షకుల ప్రేమాభిమానాలూ పొందారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో వాటి హవా మొదలైంది. ఈ సందర్భంగా తెలుగులో సెలబ్రిటీలు చేస్తున్న రియాలిటీ షోలపై ఓ కథనం.
నాగార్జున- బిగ్బాస్ సీజన్ 5
పక్కవాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం మనిషికుండే సహజ లక్షణం. దీని ఆధారంగానే ఓ పెద్ద రియాలిటీ షోనే రూపొందింది. అదే ‘బిగ్బాస్’. విదేశాల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ కాన్సెప్ట్ను ఇండియాకు తీసుకొస్తే ఇక్కడా ఆకట్టుకుంటోంది. మొదట హిందీలో అలరించిన ‘బిగ్బాస్ ప్రస్తుతం ఏడు భారతీయ భాషల్లో బుల్లితెర ప్రేక్షకుల మనసు రంజింపచేస్తోంది. తెలుగులో మొదటిసారి ఎన్టీఆర్ హోస్ట్గా ‘బిగ్బాస్’ మొదలైంది. అది విజయవంతమవడంతో ఆ తర్వాత సీజన్లను అదే ఊపుతో కొనసాగించారు. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్లో మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. రెండో సీజన్లో నాని హోస్ట్గా మెప్పిస్తే, ఆ తర్వాత రెండు సీజన్లలో నాగార్జున తనదైన స్టైల్తో షోను నడిపించారు. మధ్యలో సమంత, రమ్యకృష్ణ మెరుపులూ చూశాం. ఐదో సీజన్ ఈ నెల 5 నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు.
ఎన్టీఆర్-ఎవరు మీలో కోటీశ్వరులు
సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో హిందీలో అమితాబ్బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ గేమ్ షోని ప్రారంభించారు. అది కనీవినీ ఎరుగని రీతిలో హిట్టయింది. చాన్నాళ్లకు అదే కాన్సెప్ట్తో నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రశ్నలు, భావోద్వేగాలు, సెలబ్రిటీల ముచ్చట్లతో రసవత్తరంగా సాగే ఈ గేమ్ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్గా చేశారు. నాలుగో సీజన్ను మెగాస్టార్ చిరంజీవి నడిపించారు. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా పేరు మార్చుకొని సరికొత్తగా ముందుకొచ్చింది. హోస్ట్గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ తనదైన శైలిలో షోను రక్తికట్టిస్తున్నారు. రామ్ చరణ్తో చేసిన మొదటి ఎపిసోడ్ ద్వారా మొదటి రోజు రికార్డు టీఆర్పీ నమోదైంది. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ఈ గేమ్ షో మరింతగా అలరిస్తుందని చెబుతున్నారు షో నిర్వాహకులు.
తమన్నా- మాస్టర్ చెఫ్
ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్ చెఫ్’. ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో సూపర్ హిట్టయింది. భారతదేశంలోనూ బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకునేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు మొదలయ్యాయి. హిందీలోనూ ఇప్పటికే ఈ షో సూపర్ హిట్. ప్రపంచవ్యాప్తంగా దీనికి అభిమానులు కూడా ఎక్కువే. ఇప్పుడీ వంటల పోటీ కార్యక్రమం దక్షిణాదిన కూడా అలరిస్తోంది. ఇందులో జరిగే వంటల పోటీలను రక్తికట్టించడంలో హోస్టులదే కీలక పాత్ర. తెలుగులో వారం క్రితమే జెమిని టీవీలో ప్రారంభమైంది. మిల్కీబ్యూటీ తమన్నా హోస్ట్గా చేస్తుండటంతో ‘మాస్టర్ చెఫ్’ మరింత ఆసక్తికరంగా మారింది. తమిళంలో విజయ్ సేతుపతి చేస్తుండగా, కన్నడంలో సుదీప్, మలయాళంలో పృథ్వీరాజ్ చేస్తారని సమాచారం. నాలుగు భాషల్లో టెలికాస్ట్ కాబోతున్న కార్యక్రమానికి దర్శకుడు ఒకరే కావడం ఓ విశేషం.
లక్ష్మీ మంచు- ఆహా భోజనంబు
తెలుగు ఓటీటీ ఆహాలో మంచు లక్ష్మి చేస్తున్న మరో వంటల కార్యక్రమమే ‘ఆహా భోజనంబు’. సెలబ్రిటీలతో సరదాగా సాగిపోతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. విష్వక్శేన్, మేఘా ఆకాష్, అలీ, ఆనంద్ దేవరకొండ లాంటి తారలు ఇప్పటికే ఈ కార్యక్రమంలో సందడి చేశారు. మంచు లక్ష్మి ఈ షోను తనదైన శైలితో నడిపిస్తున్న విధానం పసందైన వినోదాన్ని అందిస్తోంది. ఇది వరకు సమంత కూడా ఆహాలో ఓ షో చేసింది. తారల ముచ్చట్లతో సాగే ‘సామ్ జామ్’ కార్యక్రమం అందరినీ అలరించింది. త్వరలో సెకండ్ సీజన్ ప్రారంభిస్తారని వినికిడి. రానా కూడా ‘నెం. 1 యారీ’ తో అలరించారు. ఇక ఈటీవీలో ‘ఆలీతో సరదాగా’ను హాస్యనటుడు అలీ, ‘వావ్’ను సాయికుమార్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా