రణ్బీర్తో ‘బుల్బుల్’ తార?
రణ్బీర్కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘కబీర్సింగ్’ తర్వాత హిందీలో తెరకెక్కిస్తున్న
ముంబయి: రణ్బీర్కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘కబీర్సింగ్’ తర్వాత హిందీలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో పరిణీతి చోప్రా ఓ నాయికగా నటిస్తోంది. ఇందులో మరో ఇద్దరు భామలకు చోటుందట. అందులో భాగంగానే బాలీవుడ్ నాయిక తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు సమాచారం.
అనుష్కశర్మ నిర్మించిన ‘బుల్బుల్’ చిత్రంలో నాయికగా ఆకట్టుకున్న తృప్తి అంతకుముందు ‘లైలా మజ్ను’, ‘పోస్టర్బాయ్స్’ చిత్రాల్లో నటించింది. ‘యానిమల్’ కోసం సారా అలీఖాన్తో పాటు పలువురినిని ఆడిషన్ చేసి వాళ్లలో తృప్తి అయితే కథకు బాగా సరిపోతుందని ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటిస్తున్న పరిణీతి చోప్రా, తృప్తిలతో రణ్బీర్ చేస్తున్న తొలి చిత్రమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి