పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి.
రాష్ట్రంలో ఒకేరోజు భిన్న వాతావరణం
జగిత్యాల జిల్లాలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల ఎండ
నల్గొండ, సూర్యాపేట, ములుగు, జనగామ జిల్లాల్లో వర్షాలు
వడదెబ్బ, పిడుగుపాటుతో నలుగురు చొప్పున మృతి
ఈనాడు, హైదరాబాద్: ఈనాడు, హైదరాబాద్: భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో 46 డిగ్రీలపైన ఎండ కాసింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 51 మండలాల్లో వడగాలులు వీచాయి.
చల్లబడ్డ జిల్లాలు
ఇన్నాళ్లూ రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన నల్గొండ, సూర్యాపేట, ములుగు, జనగామ జిల్లాలు ఆదివారం వర్షపు చినుకులతో కాస్త చల్లబడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 4.3, జనగామ జిల్లా దేవరుప్పులలో 3.2, నల్గొండ జిల్లా కేతేపల్లిలో 3.1, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల, నాగారం మండల కేంద్రాల్లో 2.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా వాజేడు, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలు, జనగామ జిల్లాకేంద్రం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లో మామిడికాయలు నేలరాలగా.. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. కొన్ని జిల్లాల్లో సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
ఎనిమిది మంది మృత్యువాత
జమ్మికుంట, ఖానాపురం, గార్ల, ఏటూరునాగారం, రఘునాథపల్లి, అడ్డగూడూరు, బేగంపేట, ఆమనగల్లు, న్యూస్టుడే: ములుగు జిల్లా ఏటూరునాగారం పట్టణానికి చెందిన రైతు బాస బుల్లెయ్య(40) ఓడవాడ సమీపంలో జంపన్నవాగు వద్ద మిర్చి ఆరబోశారు. సాయంత్రం ఈదురుగాలులు వీస్తుండటంతో కుమారుడు శివకుమార్ను వెంటబెట్టుకుని మిర్చిపై టార్పాలిన్లు కప్పేందుకు వెళ్లారు. జంపన్నవాగు దాటిన తర్వాత పిడుగుపడటంతో బుల్లెయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శివకుమార్ స్వల్పంగా గాయపడ్డారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరుకు చెందిన దాసరి అజయ్(25) తన వ్యవసాయ భూమి వద్ద తల్లితో కలిసి పశువులు మేపుతున్నారు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పశువులను పాకలో కట్టేందుకు తీసుకెళ్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. అజయ్ అక్కడికక్కడే మృతిచెందగా.. తల్లికి ప్రాణాపాయం తప్పింది. ఓ ఆవు, లేగ దూడ మృత్యువాతపడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో చిప్పలపెల్లి బాలమల్లు(65) గేదెను తోలుకుని ఇంటికి వస్తుండగా వర్షం కురవడంతో సమీపంలో ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. పక్కనే పిడుగుపడటంతో బాలమల్లుతోపాటు అతని గేదె కూడా అక్కడికక్కడే మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కావటి పద్మమ్మ(45) తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.
- కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లికి చెందిన ఎం.రాజయ్య(50) ఆదివారం జమ్మికుంట పుర పరిధి కొత్తపల్లి ఆదర్శనగర్ కాలనీ సమీపంలో ఎండ తీవ్రతతో మృతిచెందారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్కు చెందిన ముర్రు భిక్షపతి(36) కూలీ పనులు చేస్తూ, మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన జమాల్పురి నాగేందర్(45) వంట పనులకెళ్లి, బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో అన్నానగర్ చౌరస్తాలోని బీరప్ప ఆలయం వద్ద మునీర్(45) అనే కూలీ ఎండదెబ్బతో చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర కూడలి సమీపంలో జీడిమెట్ల సర్వే నంబరు 82లో ఎకరా 29 గుంటలు, సర్వే నంబరు 83లో 3 వేల గజాల స్థలాన్ని 2011లో కొన్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెబుతున్నారు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
ఇంకిన నీరు ఇంకినట్లే తోడివేత!
వర్షాలు, నీటివనరుల ద్వారా నేలలో ఇంకే నీటిని ఇంకినట్లే తోడుతున్నారు హైదరాబాద్ జిల్లా వాసులు. 2023 సంవత్సరానికి రాష్ట్రంలో నేలలోకి ఇంకిన నీటి పరిమాణం, తోడివేతపై రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. -
సహకార అధికారులకు న్యాయం చేయాలి
తెలంగాణ సహకారశాఖలో జీతభత్యాల విషయంలో ఆది నుంచీ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని... కొత్త పీఆర్సీలో తమకు పూర్తి న్యాయం చేయాలని సహకారశాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: ప్రొ. హరగోపాల్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బస్తర్, సుకుమా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను తక్షణమే నిలిపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కొలిక్కిరాని ధరణి పెండింగ్ సమస్యలు
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. -
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ (షట్టరింగ్ కార్పెంటర్స్), సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. -
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. -
ఎన్నికల సమయంలో నగదు జప్తు సబబే
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది అక్టోబరులో మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల నగదు విడుదలకు, దాని ఆధారంగా నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. -
ధాన్యం టెండర్లలో అక్రమాలు.. పెద్ది సుదర్శన్రెడ్డి
గ్లోబల్ టెండర్ల పేరుతో జరిగిన ధాన్యం అమ్మకాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని భారాస మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి