జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట: మండలం కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావుకు 3.10 ఎకరాలుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు అప్పులు చేశారు. అప్పుల్ని తీర్చడానికి ఉన్న పొలాన్ని విక్రయించడానికి బేరం పెట్టారు.
గుబులు పుట్టిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టు
ఇప్పటికే భూముల అక్రమ మార్పిడితో అవస్థలు
ఆందోళనతో తగ్గుముఖం పడుతున్న రిజిస్ట్రేషన్లు
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట: మండలం కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావుకు 3.10 ఎకరాలుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు అప్పులు చేశారు. అప్పుల్ని తీర్చడానికి ఉన్న పొలాన్ని విక్రయించడానికి బేరం పెట్టారు. వ్యవహారం చివర దశలో ఉండగా కొనుగోలుదారు భూముల వివరాలు పరిశీలించగా సుబ్బారావు పేరిట లేదని తేలింది. తనకు తెలియకుండా భూముల బదలాయింపుపై రెవెన్యూ అధికారులను కలిసి పోరాటం సాగించి అలిసిపోయారు. చివరకు గ్రామసమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి భార్య, కుమార్తె సైతం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
కడప నగర సమీపంలో సీకేదిన్నె మండలం మామిళ్లపల్లెకు చెందిన రామ్మోహన్రెడ్డికి అయిదెకరాలుంది. భూములపై బ్యాంకు రుణాలు సైతం ఏళ్లతరబడి తీసుకున్నారు. సర్వహక్కులు ఉన్నప్పటికీ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఇటీవల వేరే వ్యక్తుల పేరుతో ఆన్లైన్లో నమోదైంది. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నా ఫలితం లేకుండాపోయింది.
ముద్దనూరు మండలంలో వైకాపా నేత చిన్న దుద్యాల గ్రామానికి చెందిన ప్రభావతికి చెందిన 4.54 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆమెకు వంశపార్యంగా సక్రమించింది. కలెక్టర్, ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. తీవ్ర వివాదానంతరం రిజిస్ట్రేషన్శాఖ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. తీవ్ర పోరాటం తర్వాత మహిళకు న్యాయం జరిగింది.
ఈనాడు, కడప, న్యూస్టుడే, ఖాజీపేట, ప్రొద్దుటూరు గ్రామీణ, జమ్మలమడుగు గ్రామీణ, కొండాపురం, రాజుపాళెం, చక్రాయపేట: వైయస్ఆర్ జిల్లా జిల్లాలో ఎవరి భూములకూ రక్షణ లేదు. ఆస్తులకు భద్రత లేదు. కళ్లు మూస్తే కబ్జాలు.. కాదంటే వివాదాలు. వైకాపా రాబందుల ధాటికి సామాన్యులు విలవిలలాడుతున్న నేపథ్యంలో అరాచకాలకు ఊతమిచ్చే చట్టం వస్తే ఆక్రమణలకు అధికారికం చేసే పరిస్థితే వస్తే పరిస్థితి ఏమిటి.? అంటూ రెండు జిల్లాల ప్రజానీకం భయానక వాతావరణంలో చర్చోపచర్చలతో ఆందోళన పడుతున్నారు. ఈ భయానక చిత్రానికి కర్త..కర్మ.. క్రియ జగన్. ఆయన స్వీయ దర్శకత్వంలో నడిచే వైకాపా ప్రభుత్వం ‘ల్యాండ్ టైటలింగ్ యాక్టు’ను తీసుకొచ్చింది. ఈ చట్టంపై ఊరూవాడా జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆస్తులకు రక్షణ లేకుండా విలవిలలాడుతుండగా, కొత్తగా అమల్లోకి వచ్చే చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే తరుణంలో చాలా మంది భయంతో రిజిస్ట్రేషన్లకు వెళ్లడంలేదు. నిత్యం కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అవసరాలున్న వారు ఎన్నికల వరకు ఆగుదామనే అభిప్రాయానికి క్రయ విక్రయదారులొచ్చారు.
- భూమి కనిపించని ఆభరణం. ఇలా ఎన్నో అవసరాలు తీరుస్తూ ఆకాంక్షలను నెరవేర్చే ఈ భూమి భద్రంగా ఉన్నప్పుడే కుటుంబానికి భరోసా. సామాన్యుడి భూములపై హక్కులను కాలరాసే వ్యవహారం నడిచింది. కోర్టులు.. చట్టాలు ఉన్నా వాటికి అతీతంగా కొత్తగా భూమి హక్కు చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే అక్రమాల పరంగా చూస్తే జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఎ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకరి భూములు మరొకరిపై యాజమానుల ప్రమేయం లేకుండా బదిలీ అయిపోయాయి. అవసరాల సమయంలో పరిశీలించుకుంటే భూములు తమ పేరిట లేని వ్యవహారం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. కొంతమంది పోరాటం చేయలేక భూముల్ని వదులుకున్న దాఖలాలున్నాయి. మరికొందరైతే పోరాటంతో అలిసి పోయి చివరికి ఆత్మహత్యలు.. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.
ప్రజలను మోసం చేయడానికే...
భూములు కొనుగోలు తర్వాత అసలు పత్రాలు ఇవ్వకుండా కేవలం జిరాక్స్ పత్రాలు ఇవ్వడమేంటి? స్థిరాస్తిని చూపి రుణాలు తెచ్చుకోవాలంటే అసలు పత్రాలు చూపాలి. అవి లేకుండా రుణాలు ఇవ్వరు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజలను మోసం చేయడానికి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది.
వెంకటరెడ్డి, బి.కొత్తపల్లె, ఖాజీపేట మండలం
వైకాపాకు గుణపాఠం చెప్పాలి
ఈ చట్టంతో పత్రాలున్నా స్థిరాస్తులకు భద్రత ఉండదు. పక్కా ఆధారాలను సమర్పించినా సంబంధిత అధికారి చేతివాటంతో దారుణంగా నష్టపోవడం ఖాయం. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకించి వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి.
బోడెల బాబుల్రెడ్డి, శంకరాపురం, ప్రొద్దుటూరు మండలం
ఆస్తులకు భద్రత కరవు
వైకాపా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం చాలా ప్రమాదకరం. భూయజమానులు విదేశాల్లో ఉంటే ఇది మరీ ప్రమాదకరంలా మారుతుంది. వ్యక్తిగత ఆస్తులపై ప్రభుత్వ పెత్తనాన్ని ప్రజలు గమనించారు. ఈ చట్టం అమలుకు రీసర్వే పేరుతో ప్రభుత్వం డిజిటల్ రికార్డులు తయారు చేస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలి.
రాజశేఖర్, బురుజుపల్లె, కొండాపురం
ఆస్తులకు రక్షణ ఉండదు
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ సూచనలు పట్టించుకోలేదు. చట్టం అమలయ్యే పక్షంలో రెవెన్యూ అధికారులదే పెత్తనం అవుతుంది. వివాదం తలెత్తినా సివిల్ కోర్టుకు వెళ్లే హక్కు లేదు. హైకోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఉండదు.
వెంకట సుబ్బారెడ్డి, న్యాయవాది, అమరావతి
పాసుపుస్తకాలపై సీఎం జగన్ ఫొటో ఎందుకు?
వారసత్వంగా వస్తున్న భూహక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. రీసర్వే పేరుతో మా భూమిహక్కు పత్రాలపై సీఎం జగన్ చిత్రాలు ప్రచురించడం దారుణం. ఇలా చేస్తే మా భూముల హక్కులపై అనుభవం ఉన్నా అధికారుల తీరుతో రైతులకు ఉరితాడుగా మారుతుంది.మా భూములపై హక్కులు లేకుండా పోతాయి.
శ్రీనివాసులురెడ్డి, కొర్రపాడు
ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు
వారసత్వంగా 3.60 ఎకరాలకు సంబంధించి రికార్డులు నా దగ్గర ఉన్నాయి. రీసర్వేలో 1.45 ఎకరాలు తొలగించి 2.15 ఎకరాలు మాత్రమే రికార్డులో నమోదు చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.
ఎన్.రామ్మోహన్రెడ్డి, ఆవులవాండ్లపల్లె, చక్రాయపేట మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
[ 18-05-2024]
పోలింగ్ రోజున కడప గౌస్నగర్లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
[ 18-05-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది. -
కాలేటివాగులో కాలనాగులు
[ 18-05-2024]
ప్రతిష్ఠాత్మకమైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉండగా, దీనికి సమాంతరంగా మరొక దానిని ప్రతిపాదించి రూ.వేల కోట్లతో పనులు చేపట్టారు. కాలేటివాగు ప్రాజెక్టు ప్రతిపాదనపై ఆది నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం కొల్లకొట్టడానికే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారంటూ విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. -
పోలీసు విధుల్లో కొరవడిన ‘చైతన్య’ం!
[ 18-05-2024]
తాడిపత్రికి స్పెషల్ డ్యూటీ పేరిట అర్ధరాత్రి పూట వెళ్లి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లోని పనివాళ్లను విచక్షణారహితంగా కొట్టడం... ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం... దివ్యాంగుడైన కంప్యూటరు అపరేటర్ కిరణ్ తల పగలుకొట్టడం... ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం. -
పురజనుల కష్టాలు చూస్తేనే జలదరింపు!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
జయజయధ్వానాలతో మార్మోగిన బ్రహ్మంగారిమఠం
[ 18-05-2024]
భక్తులు జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై అనే నామస్మరణతో బ్రహ్మంగారి మఠ ఆవరణ మారుమోగింది. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, ఆరాధన గురు పూజా మహోత్సవంలో శుక్రవారం స్వామి వారు దీక్షా బంధన ఆలంకారోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
డబ్బులుంటేనే దప్పిక తీరేది!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
అగ్నిమాపక శాఖలో అసౌకర్యాల మంట
[ 18-05-2024]
అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంటే వెంటనే మంటలు ఆర్పేయాలి.. లేకుంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక్కో సారి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నపాటి మంటలు చెలరేగినా అధిక ఉష్ణోగ్రతలతో ఈదురు గాలుల తీవ్రతతో క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. -
ఇసుకాసురులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
[ 18-05-2024]
ఇసుకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ డిమాండ్ చేశారు. శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న గుర్రంకొండ మండలంలోని తరిగొండ రామానాయుడు చెరువును పరిశీలించారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
[ 18-05-2024]
ట్యాంకు నుంచి తమ ఇంటికి ఏర్పాటు చేసుకున్న తాగునీటి పైపును వైకాపా నేతలు అకారణంగా కోసేశారని... ఎందుకు ఇలా చేశారని అడిగిన పాపానికి మూకుమ్మడిగా దాడి చేశారని చిన్నమండెం మండలం మల్లూరు క్రాస్కు చెందిన తెదేపా కార్యకర్త కదిరి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
[ 18-05-2024]
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేశాపురం గ్రామం గుట్టమోటు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీల మృతి
[ 18-05-2024]
వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు. -
మదనపల్లెలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం
[ 18-05-2024]
మదనపల్లె మండలంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం నుంచి ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదనపల్లెకు రానున్న నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు