Naresh Goyal: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది.
Naresh Goyal | ముంబయి: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు (Naresh Goyal) బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా బాంబే హైకోర్టు రెండు నెలల తాత్కాలిక బెయిల్ను మంజూరుచేసింది. బెయిల్పై కొన్ని షరతులు విధించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ముంబయి వీడకూడదని, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పాస్పోర్టు కూడా సరెండర్ చేయాలని జస్టిస్ ఎన్జే జామ్దార్తో కూడిన సింగిల్ బెంచ్ సూచించింది.
అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్ను ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సకు మాత్రం అనుమతించింది. దీంతో గోయల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనతోపాటు తన భార్య అనితా గోయల్ కూడా క్యాన్సర్తో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని నరేశ్ గోయల్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది బెయిల్ను వ్యతిరేకించారు. ఆస్పత్రిలో చికిత్స కావాలంటే పొడిగించాలన్నారు. గోయల్ అనారోగ్యంతో పాటు, మానసిక అనారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా సాల్వే ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్
దేశీయ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి జెట్ ఎయిర్వేస్ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరులో నరేశ్ గోయల్ను అరెస్టు చేసింది. అదే ఏడాది నవంబర్లో గోయల్ భార్యను అరెస్ట్ చేసినప్పటికీ.. ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగా ప్రత్యేక కోర్టు అదేరోజు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్