Trisha: సొంత ఇంటికి వచ్చినట్లు అనిపించింది!
‘ మౌనమ్ పెసియాదే’ అనే తమిళ చిత్రంతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ‘వర్షం’ విజయంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా ఎదిగింది త్రిష.
‘ మౌనమ్ పెసియాదే’ అనే తమిళ చిత్రంతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ‘వర్షం’ విజయంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా ఎదిగింది త్రిష. ‘నువ్వొస్తానంటే..నేనొద్దంటానా’తో అభిమానులకు వద్దనకుండానే మంచి ట్రీట్ అందించింది. వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇమేజ్ను మాత్రం ఈ ఏడాదిలో విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు పూర్తిగా మార్చేశాయి. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలకు జోడీగా మారి మరోసారి తన క్రేజ్ను నిరూపించుకుంది. ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న ‘లియో’లో విజయ్కి జోడీగా నటించి మెప్పించింది త్రిష. 15 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రమిది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘లియో’ సినిమా అనుభవాల్ని పంచుకుంది.
ఒకే వ్యక్తితో నాలుగు సినిమాలు చేసి...15ఏళ్ల తర్వాత తిరిగి అదే వ్యక్తితో కలసి మరో సినిమా చేస్తున్నామంటే తనతో ఉండే మంచి అనుబంధమే దానికి కారణం. అలాంటి కంఫర్ట్ నాకు విజయ్తో ఉంటుంది. ‘మీ ఇద్దరినీ తెరపై మళ్లీ ఎప్పుడూ చూస్తాం’ అని కొంత కాలంగా అడిగేవారు. ఈ సినిమాతో వారి కల నెరవేరినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత తిరిగి మేమిద్దరం నటిస్తున్న ఈ సినిమాపై వారికి మంచి హైప్ ఉంటుంది.
- మేము ఇంతకముందు చేసిన సినిమాలు ఎంత ఆహ్లాదకరంగా ఉండేవో మా ఇద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ, విదేశాలలో చిత్రీకరించిన పాటలు చూస్తే తెలుస్తోంది. అప్పట్లో సినిమాలు చాలా భిన్నంగా ఉండేవి. విజయ్ అద్భుతంగా నటించేవాడు. కానీ ఇప్పుడు విజయ్ నటుడిగా చాలా ఎదిగాడు. అది ‘లియో’ సెట్లో చూడటం ఆనందంగా అనిపించింది. నేను ఆయనతో కలిసి చేసిన సినిమాలోని పాత్రలకంటే ఇందులోని పాత్ర చాలా కొత్తగా ఉంది.
- ‘లియో’లో నేను చేసిన ‘సత్య’ పాత్రను చంపనని లోకేష్ విడుదలకు ముందే చెప్పాడు. అదే చేశాడు. నా పాత్రను చివరివరకూ కొనసాగిస్తారని నాకు ముందే తెలుసు. నేనూ, లోకేష్ 2020చివరిలో కలిశాము. ఈ సినిమా చేయటానికి చాలా ఆసక్తితో ఉన్నానని అన్నాడు. రెండేళ్ల తర్వాతా తిరిగి కలిసినప్పుడు రెండు గంటలకు పైగా తన ఆఫీస్లో కథను వివరించాడు. మేము అనుకున్నదానికంటే ఎక్కువగానే ఈ సినిమాను ఆదరించారు ప్రేక్షకులు.
- దాదాపు రెండేళ్లపాటు ఈ చిత్రంకోసం పనిచేశాను. లోకేష్ రూపొందించిన ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. కొన్ని సన్నివేశాల కోసం రిహార్సల్స్ కూడా ఎక్కువ చేయలేదు. ఆరునిమిషాల సన్నివేశాన్ని కూడా సింగిల్ టేక్లో చేశాము. విజయ్, నేను చేసిన ఆ మ్యాజిక్ ఎంత అద్భుతంగా ఉందో తెరపై చూస్తేనే తప్ప అర్థంకాలేదు. అంతేకాదు షూటింగ్ను కూడా తొందరగా ముగించినందుకు లోకేష్ సంతోషపడ్డాడు.
- నాకు 19లేదా 20 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి విజయ్ని కలిశాను. ఎవరితోనైనా 20ఏళ్లకు పైగా స్నేహంగా ఉండి, వారితో మళ్లీ కలిసి పనిచేసినప్పుడు నిజంగా సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. విజయ్ విషయంలో నాకు అదే అనిపించింది. లోకేష్ కనగరాజ్ మా విషయంలో అలాంటి అనుభూతి కలిగేలా చేశారు.
- ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ లాంటి సినిమాలు తీసిన లోకేష్ పనితీరు నాకు చాలా నచ్చింది. ఫాంటసీ, ఫిక్షన్, మాస్...ఇలా అన్నీ అంశాలను ఎంతో వినోదాత్మకంగా తీస్తాడు. నేను కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ‘లియో’తో భాగం కావడం ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..