నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు

మనీ లాండరింగ్‌ కేసులో నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో....

Updated : 02 Jul 2021 14:09 IST

ముంబయి: మనీ లాండరింగ్‌ కేసులో నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది. ఈమేరకు జులై 7న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. యామీ గౌతమ్‌ ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమన్లు అందుకున్నారు.

‘ఉల్లాస ఉత్సాహ’ కన్నడ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమ్‌ పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘విక్కీ డోనర్‌’, ‘యాక్షన్‌ జాక్సన్‌’, ‘బద్లాపూర్‌’, ‘ఉరి’, ‘బాలా’ చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఆమె ‘ఉరి’ చిత్ర దర్శకుడు ఆదిత్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని