Prajwal Revanna: ‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
ప్రజ్వల్పై ఆరోపణలకు సంబంధించిన వీడియోలను ఎవరు లీక్ చేశారనే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కార్తిక్, భాజపా నేత దేవరాజేగౌడలు.. నువ్వంటే నువ్వే లీక్ చేశావని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినట్లు చెబుతోన్న అభ్యంతరకర వీడియోలు వైరల్గా మారడం కన్నడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రజ్వల్పై జేడీఎస్ ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేయగా.. అసలు ఎవరు ఈ వీడియోలను లీక్ చేశారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ మాజీ డ్రైవర్ కార్తిక్, భాజపా నేత దేవరాజే గౌడల పేర్లు తెరపైకి వచ్చాయి. వాటిని నువ్వంటే నువ్వే లీక్ చేశావని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనార్హం.
ప్రజ్వల్ రేవణ్ణ వద్ద 15 ఏళ్లపాటు డ్రైవర్గా పని చేసినట్లు కార్తిక్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఓ ఏడాది నుంచి ప్రజ్వల్ దగ్గర ఉండటం లేదన్న ఆయన.. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా భూమిని లాక్కున్నారు. నా భార్యపై చేయిచేసుకున్నారు. నన్ను మానసికంగా వేధించారు. అందుకే అక్కడినుంచి బయటకు వచ్చి నా భూమి కోసం పోరాటం చేస్తున్నా’’ అని అందులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ దేవేగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేవరాజే గౌడ వద్దకు వెళ్లానని అన్నాడు.
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
‘‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో హోళెనరసీపుర స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన దేవరాజే గౌడ.. రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. ఇదే సమయంలో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు నేను విడుదల చేయకుండా ప్రజ్వల్ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే, వాటిని తనకు అప్పగిస్తే న్యాయస్థానానికి ఇచ్చి స్టే ఆర్డర్ ఎత్తివేయిస్తానని దేవరాజే గౌడ హామీ ఇచ్చారు. ఆయనపై నమ్మకం ఉంచి వాటిని ఇచ్చేశాను. అయినా నన్ను మోసం చేశాడు’’ అని కార్తిక్ ఆరోపించాడు. దేవరాజేకు మినహా కాంగ్రెస్ నేతలకు, ఇతరులకు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలందరూ ప్రజ్వల్కు సన్నిహితులేనని తెలిపారు. భాజపా, జేడీఎస్ కూటమి ఏర్పాటుకాకముందే.. ప్రజ్వల్ ప్రవర్తన విషయాన్ని దేవరాజే భాజపా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాడని కార్తిక్ చెప్పాడు.
అది వారి పనే : దేవరాజే
కార్తిక్ చేసిన ఆరోపణలను దేవరాజే గౌడ తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేత, హసన లోక్సభ అభ్యర్థి శ్రేయస్ పాటిల్తో కార్తిక్ తిరుగుతున్నాడని చెప్పాడు. జేడీఎస్, భాజపా నేతలెవరూ ఆ వీడియోలు విడుదల చేయలేదని అన్నారు. వీటివల్ల కేవలం కాంగ్రెస్ పార్టీనే లబ్ధి పొందుతుందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రేయస్ పాటిల్ ఈ చర్యలకు పాల్పడిఉంటారని ఆరోపించారు. సిట్ నోటీసుల కోసం వేచిచూస్తున్నానని.. వారికి తనదగ్గరున్న ఆధారాలు అప్పగిస్తానని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
BJP: భాజపా ఎంపీ జయంత్ సిన్హా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో భాజపా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
భాజపా సీనియర్ నేత నోరుజారి ఇరకాటంలో పడ్డారు. తాను చేసిన పొరపాటుకు ప్రతిగా ఉపవాసం చేస్తానని చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుడమి గర్భాన ‘బొగ్గు’మన్న మంటలు!
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖలారీ రేంజ్లో బొగ్గు గని నుంచి సోమవారం ఎగసిపడుతున్న అగ్నికీలలివి. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
దురుసు డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. -
చదవాల్సిన పుస్తకం!
మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. -
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు