Lok Sabha Polls: దిల్లీలో సుష్మా స్వరాజ్ కుమార్తె నామినేషన్.. బాన్సురీ ఆస్తుల విలువ ఎంతంటే?
భాజపా అభ్యర్థి, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ (Lok Sabha Elections) దేశ రాజధాని నగరంలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్తో పాటు 13మంది మంగళవారం నామినేషన్లు వేశారు. న్యూదిల్లీ నుంచి భాజపా అభ్యర్థిగా రేసులో ఉన్న బాన్సురీ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తంగా రూ.19 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉండగా.. వీటిలో రూ.11.27 కోట్లు చరాస్థులు, రూ.8 కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, హరియాణాలోని పాల్వాల్లో రూ.99.34 లక్షల విలువైన ఉమ్మడి ఆస్తిలో 1/6వ వంతుతో పాటు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు ఫ్లాట్లు, హేలీ రోడ్లో ఒక ఫ్లాట్ ఉన్నాయని తెలిపారు. 2023లో కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారుతో పాటు రెండు సొంత వాహనాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలివే..
వృత్తి రీత్యా న్యాయవాది అయిన 40 ఏళ్ల బాన్సురి 2022-23 ఐటీ రిటర్నుల్లో తన ఆదాయాన్ని రూ.68.28లక్షలుగా పేర్కొన్నారు. వార్విక్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఏ (ఆనర్స్) పూర్తిచేసిన ఆమె.. న్యాయవిద్యనభ్యసించడానికి లండన్ వెళ్లారు. అక్కడి ‘బీపీపీ లా స్కూల్’లో న్యాయవిద్య పూర్తిచేసి .. ‘ఇన్నర్ టెంపుల్’ కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసి బారిస్టర్గా అర్హత సాధించారు. ఆపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సెయింట్ క్యాథరిన్ కాలేజీ నుంచి 2009లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె న్యాయవాది వృత్తిలో రాణిస్తూ ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దిల్లీలో మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలకు మే 25న ఎన్నికలు జరగనుండగా.. నిన్న మొదలైన నామినేషన్ల పర్వం మే 6 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు మొత్తంగా 26మంది నామినేషన్లు వేసినట్లు దిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
-
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్రెడ్డి
-
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ