Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. గెలాక్సీ ఎస్‌23పై ₹20వేలు డిస్కౌంట్‌

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్‌ ఉండనుంది.

Published : 01 May 2024 00:05 IST

Flipkart Big Saving Days Sale 2024 | ఇంటర్నెటెడెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ త్వరలో ప్రారంభం కానుంది. మే 3 నుంచి మే 9 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. అయితే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై అందించనున్న డిస్కౌంట్లు తాజాగా రివీల్‌ అయ్యాయి. ఈ జాబితాలో శాంసంగ్‌ ఎస్‌23, పోకో ఎక్స్‌6 ప్రో, నథింగ్‌, మోటో, ఐఫోన్‌ 14 వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. 

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో రూ.27,999కే లభించనుంది. మోటో ఎడ్జ్‌ 40 నియో ఈ సేల్‌లో రూ.19,999కే దొరుకుతుంది. మోటో జీ64 రూ.12,999, మోటో జీ34 రూ.9,999కే కొనుగోలు చేయొచ్చు. బడ్జెట్ ధరలో మొబైల్‌ కొనుగోలు చేయాలనుకొనేవారు వీటిని పరిశీలించొచ్చు. ఇక పోకో ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. పోకో ఎం6 ధర రూ.7,999, పోకో ఎక్స్‌6 రూ.17,999కే లభిస్తుంది. పోకో ఎక్స్‌6 ప్రో, పోకో ఎం6 ప్రో, వివో టీ3.. ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నాయి. అయితే ఈ ఆఫర్లు ఇంకా రివీల్‌ చేయలేదు.

సేల్స్‌ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్‌.. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్‌

గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. పిక్సెల్‌ 7ఏ ధర రూ.31,999, పిక్సెల్‌ 8 రూ.49,999కే లభించనుంది. ఆఫర్‌ సమయంలో ఐఫోన్‌ 14 రూ.55,999, ఐఫోన్‌ 12ను రూ.39,499కే కొనుగోలు చేయొచ్చు. గతేడాది ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23పై పెద్దఎత్తున తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. గెలాక్సీ ఎస్‌23 బేసిక్‌ వేరియంట్‌ ధర రూ.74,999, 256జీబీ వేరియంట్‌ను రూ.79,999కు కంపెనీ అప్పట్లో లాంచ్‌ చేసింది. ఆ తర్వాత రూ.10వేలు ధరను తగ్గించింది. తాజాగా ప్రకటించిన ఆఫర్‌లో గెలాక్సీ ఎస్‌23 రూ.44,999కే లభించనుంది. అంటే ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్‌ పొందొచ్చన్నమాట. గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ రూ.39,999కే దొరుకుతుంది.

వీటితో పాటు కార్డులపై ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని