దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ దిల్లీ చేరుకున్నారు. అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హస్తిన వచ్చారు. రాత్రి 9 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాతో జగన్ భేటీ అయ్యే అవకాశముంది. ప్రధాని మోదీతో భేటీపైనా
దిల్లీ: ఏపీ సీఎం జగన్ దిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హస్తిన వచ్చారు. ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాతో జగన్ భేటీ అయ్యే అవకాశముంది. ప్రధాని మోదీతో భేటీపైనా స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతులు చేపట్టిన దేశవ్యాప్త బంద్కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఆ రోజున మధ్యాహ్నం వరకు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసింది. ఈ అంశమే ప్రధానంగా అమిత్ షా, జగన్ భేటీలో చర్చకు వచ్చే ఆస్కారముందని తెలిసింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. పోలవరంపై అమిత్ షా జోక్యాన్ని సీఎం జగన్ కోరనున్నట్లు సమాచారం. దీంతో పాటు నివర్ తుపానుతో రాష్ట్రంలో జరిగిన నష్టానికి కేంద్ర సాయంపైనా సీఎం చర్చించే అవకాశముంది. దిల్లీ పర్యటనలో జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, అవినాశ్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మార్గాని భరత్, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.