పురందేశ్వరి, డీకే అరుణకు బాధ్యతల అప్పగింత

ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమితులైన వారికి  భాజపా బాధ్యతలు అప్పగించింది.  ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు.........

Updated : 30 Aug 2022 16:19 IST

తెలంగాణ భాజపా ఇన్‌ఛార్జిగా తరుణ్‌ చుగా 

దిల్లీ: ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమితులైన వారికి భాజపా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి బాధ్యతలను కేటాయించారు. ఏపీ భాజపా ఇన్‌ఛార్జ్‌గా మురళీధరన్‌, సహ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ దేవధర్‌ కొనసాగనున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ఇన్‌ఛార్జ్‌గా పురందేశ్వరిని నియమించారు. తెలంగాణ భాజపా ఇన్‌ఛార్జ్‌గా తరుణ్‌ చుగాకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్‌ప్రదేశ్ సహ ఇన్‌ఛార్జ్‌గా సత్యకుమార్‌, మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా మురళీధర్‌రావు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్‌ఛార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌ రెడ్డికి బాధ్యతలు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని