ఫడణవిస్ను ట్రోల్ చేయడం సరికాదు: శివసేన
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్పై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారని అభినందించింది. కొవిడ్-19 సోకితే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరతానని ఆయన...
ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్పై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారని అభినందించింది. కొవిడ్-19 సోకితే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరతానని ఆయన చెప్పడం ప్రచారం కోసం కాదని తెలిపింది.
ప్రభుత్వ వైద్య సదుపాయాలు, యంత్రాంగంపై ఫడణవిస్ సంతృప్తి వ్యక్తం చేశారని సామ్నా పత్రికలో శివసేన పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వానికీ, రోగులకీ, సిబ్బందికీ ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయని వెల్లడించింది. ‘యువ నాయకుడు, ప్రతిపక్ష నేతగా దేవేంద్ర ఫడణవిస్ డైనమిక్ అనడంలో సందేహం లేదు. తనకు కరోనా పాజిటివ్ వస్తే చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తానని వారి పార్టీనేతలతో అన్నట్టు తెలిసింది’ అని సామ్నా తెలిపింది.
‘ఇలా మాట్లాడినందుకు ఫడణవిస్ను నిజానికి అభినందించాలి. కానీ ట్రోలింగ్ చేస్తున్నారు. అది సరికాదు. ప్రతిపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లు సమర్థంగా వ్యవహరిస్తున్నారని మేం ఎన్నోసార్లు చెప్పాం. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరతానని చెప్పడం స్టంట్ కాదు. ఏమన్నా జరిగితే తనను రక్షిస్తారని ప్రభుత్వ వైద్యం, యంత్రాంగంపై ఆయనకున్న ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఆయన మాటలు వైరస్పై పోరాడేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందికి ఆత్మవిశ్వాసం నింపాయి. అందుకు ఆయన్ను అభినందించాలి’ అని సామ్నా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం