కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది.

Published : 09 Oct 2020 10:29 IST

నిజామాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. నిజామాబాద్‌, కామారెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రత్యేక క్యాంపుల్లో ఉన్న ఓటర్లు కాసేపట్లో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకోనున్నారు. 

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్‌ కేంద్రాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల తోపాటు మున్సిపాలిటీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటు వేయనున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి, భాజపా నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఈ నెల 12న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని