యువ ఓటర్ల ఆకర్షణకు కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ
నానాటికీ దేశంలో కాంగ్రెస్ ప్రభ తగ్గుతోంది. యువ ఓటర్లు ఆ పార్టీకి దూరమవుతున్నారు. పూర్తి స్థాయి నాయకత్వలేమి పార్టీని వెంటాడుతోంది. ఇటీవల ఈ అంశాలే ఎజెండాగా పార్టీ సీనియర్లు కాంగ్రెస్ అధినేత్రికి లేఖాస్త్రం......
లఖ్నవూ: నానాటికీ దేశంలో కాంగ్రెస్ ప్రభ తగ్గుతోంది. యువ ఓటర్లు ఆ పార్టీకి దూరమవుతున్నారు. పూర్తి స్థాయి నాయకత్వలేమి పార్టీని వెంటాడుతోంది. ఇటీవల ఈ అంశాలే ఎజెండాగా పార్టీ సీనియర్లు కాంగ్రెస్ అధినేత్రికి లేఖాస్త్రం సంధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ ఓటర్లకు గాలం వేసేందుకు యూపీ కాంగ్రెస్ వినూత్న పంథాలో ముందుకెళుతోంది. వారిని ఆకట్టుకునేందుకు క్విజ్ పోటీ నిర్వహిస్తోంది.
ఈ నెల 13, 14 తేదీల్లో యూపీ కాంగ్రెస్ ఈ పోటీ నిర్వహించనుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యక్తిత్వం, విజయాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. 16-22 ఏళ్ల వయసున్న వారు ఈ క్విజ్లో పాల్గొనవచ్చు. ఇప్పటికే 5 లక్షల మంది ఈ పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని, దాదాపు 20 లక్షల మంది వరకు ఇందులో పాల్గొనే అవకాశం ఉందని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు.
ఈ క్విజ్ ద్వారా యువత మాజీ ప్రధాని వ్యక్తిత్వం, విజయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని అశోక్ సింగ్ పేర్కొన్నారు. ఈ పోటీ అనంతరం వారితో పార్టీ సంభాషించనుందని తెలిపారు. యువత ముందుకు రావాలన్నదే పార్టీ నాయకత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. భాజపా ప్రజా వ్యతిరేక విధానాలతో యువత తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.