AAP: గోవాలో హంగ్ అంచనా.. కాంగ్రెస్ బాటలోనే ఆప్..!
గోవాలో హంగ్ తలెత్తే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించడంతో అక్కడి పార్టీలు అప్రమత్తమయ్యాయి.
పనాజీ: గోవాలో హంగ్ తలెత్తే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించడంతో అక్కడి పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థుల్ని రిసార్టుకు తరలించగా.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆ తరహాలోనే వ్యవహరిస్తోంది. తమ అభ్యర్థుల్ని రక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ మెజార్టీ మార్కుకు కాస్త దూరంలో ఆగిపోతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో 2017 నాటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్, ఆప్ తమ అభ్యర్థుల్ని కాచుకోవడం ప్రారంభించాయి. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులందరినీ ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 10, గురువారం మధ్యాహ్నం వరకు వారంతా అక్కడే ఉండాలని పార్టీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీ కీలకంగా మారొచ్చని తెలుస్తోంది.
40 నియోజకవర్గాలున్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 21 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ హంగ్ ఏర్పడింది. 17 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. 13 సీట్లు గెలిచిన భాజపా ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.