Karnataka: యడియూరప్ప పాలన బాగుంది: నడ్డా

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ(భాజపా) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కితాబిచ్చారు.

Published : 26 Jul 2021 02:00 IST

దిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ(భాజపా) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కితాబిచ్చారు. పరిస్థితులను ఆయన సొంతంగానే చక్కదిద్దుతున్నట్టు పేర్కొంటూ ప్రశంసించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఆదివారం తోసిపుచ్చారు. సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెలువడిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటక సీఎంగా యడియూరప్పనే కొనసాగించాలని కోరుతూ సుమారు 500 మందికిపైగా వీరశైవ లింగాయత్‌ సాధువులు డిమాండ్‌ చేసిన అనంతరం నడ్డా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాధువులు సీఎంను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి యడియూరప్పను తొలగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారిలో కొందరు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని