CM Jagan: విశాఖ నుంచే పరిపాలన చేయబోతున్నా: సీఎం జగన్
విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని ఏసీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్నారు.
విశాఖ: దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy) తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని.. దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందని అన్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో జగన్ మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలున్నాయి. సదస్సు మొదటి రోజు వివిధ సంస్థలతో 92 ఒప్పందాలు (ఎంవోయూ) జరిగాయి. 340 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయి.. మరో 4 పోర్టులు రాబోతున్నాయి. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయి. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు’’ అని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉంది. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నాను. త్వరలోనే ఇది సాకారం అవుతుంది’’ అని సీఎం జగన్ వెల్లడించారు.
ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి: ముఖేశ్ అంబానీ
‘‘సంస్కృతి, సంప్రదాయాలకు ఏపీ నిలయం. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ముందుంది. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్టం ఏపీ. ఏపీలో జియో నెట్ వర్క్ వేగంగా వృద్ధి చెందింది. పలు రంగాల్లో ఏపీ అభివృద్ధికి సంతోషిస్తున్నాం. సౌర విద్యుత్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతుంది. ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి’’ అని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది. ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి అభినందనీయం. అపోలో కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది.
- అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్మన్
ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్ తనదైన పాత్ర పోషిస్తోంది. ఏపీలో మా కార్యకలాపాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో చాలామందికి ఉపాధి కల్పిస్తాం.
- శ్రీసిమెంట్ ఛైర్మన్ హరిమోహన్ బంగుర్
ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. జీఎస్డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. ఏపీలో జిందాల్ స్టీల్స్ రూ.10వేల కోట్ల పెట్టుబడులతో ఉపాధి కల్పిస్తాం.
- నవీన్ జిందాల్
నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు. ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంది. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ విజన్ అద్భుతం.
- జీఎంఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం