ఏపీ: ‘ఎమ్మెల్సీ’లను నామినేట్‌ చేసిన గవర్నర్‌

గవర్నర్‌ నామినేట్‌ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను ఏపీ సీఎం జగన్‌ భర్తీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇద్దరు వైకాపా అభ్యర్థులను నామినేట్‌ చేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను ఇటీవల కోరింది. ప్రభుత్వం సిఫార్సుల మేరకు జకియా

Published : 29 Jul 2020 00:54 IST

అమరావతి: గవర్నర్‌ నామినేట్‌ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వారిని నామినేట్‌ చేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం సిఫార్సుల మేరకు జకియా ఖానం, పాండుల రవీంద్రబాబును ఎమ్మెల్సీలుగా గవర్నర్‌ నామినేట్‌ చేశారు. గతంలో కంతేటి సత్యనారాయణ రాజు, టి. రత్నభాయిలు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు ఉండగా.. వారి పదవీకాలం మార్చిలోనే ముగిసింది. దీంతో వారి స్థానాల్లో తాజాగా జకియా ఖానం, రవీంద్రబాబును గవర్నర్‌ నామినేట్‌ చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని