Andhra News: ఏ వ్యవస్థపైనా మేము దాడి చేయడం లేదు: బొత్స
ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని
అమరావతి: ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఉక్రోషంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుందని, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో ఎక్కడైనా లోపం ఉంటే మార్పులు.. చేర్పులు ఉంటాయన్నారు. ఏ వ్యవస్థపైనా తాము దాడి చేయలేదని వెల్లడించారు. రాజ్యాంగానికి లోబడే చట్టాలు ఉంటాయని, ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలోనే పనిచేయాలన్నారు. హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని మంత్రి వ్యాఖ్యానించారు. తెదేపా శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని కోరవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో మిగిలింది 7,300 ఎకరాలు మాత్రమేనని, అది విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తుందా? అని బొత్స ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం