Kamareddy: కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ అరెస్టు.. కామారెడ్డిలో మరోసారి ఉద్రిక్తత
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ ఎందుకు సమాధానం చెప్పరో చూస్తానంటూ బండి సంజయ్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో రైతులు, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు.
కామారెడ్డి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కామారెడ్డి (kamareddy) కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అడ్లుర్ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడిస్తానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి ఆయన కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. నిన్న జరిగిన ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్కు అర కిలోమీటరు దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించి రైతులు, భాజపా కార్యకర్తలు చొచ్చుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
ఒక దశలో కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించారు. కలెక్టర్ వచ్చి కామారెడ్డి బహృత్ ప్రణాళికపై సమాధానం చెప్పాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ బండి సంజయ్ను కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు రైతులను చెదరగొట్టి బండి సంజయ్ను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.