తెలంగాణలో రామరాజ్యమే లక్ష్యం : బండి
తెలంగాణలో రామరాజ్యం తేవడమే లక్ష్యంగా భాజపా కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బాన్సువాడ: తెలంగాణలో రామరాజ్యం తేవడమే లక్ష్యంగా భాజపా కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నేత మాల్యాద్రి రెడ్డి భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తే.. వాటి పేర్లు మార్చి తమ నిధులని చెప్పుకుంటూ తెరాస పబ్బం గడుపుతోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్న తెరాసను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు నిలదీయాలని కోరారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గాన్ని పోచారం కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక, భూ వ్యాపారం చేస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్