Mamata Banerjee: ప్రత్యామ్నాయం లేకనే అధికారంలో భాజపా..!
ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించుతారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.
జాతీయస్థాయిలో మరో రాజకీయ వేదిక అవసరమన్న మమతా బెనర్జీ
టీఎంసీ సంస్థాగత సమావేశానికి హాజరైన ప్రశాంత్ కిశోర్
కోల్కతా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ జాతీయ స్థాయిలో కొత్త కూటమిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించుతారని ఉద్ఘాటించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేనందునే కేంద్రంలో భాజపా అధికారంలో కొనసాగుతోందన్న మమతా.. ఆ ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేసేందుకు తృణమూల్తో సహా ఇతర విపక్ష పార్టీలు ఏకమవ్వాలని సూచించారు.
‘జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేనందునే భాజపా ఇంకా అధికారంలో కొనసాగుతోంది. అది దొరికిన రోజు భాజపా అధికారం నుంచి దిగిపోతుంది’ అంటూ కోల్కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగత సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక టీఎంసీ ఛైర్పర్సన్గా ఫిబ్రవరి నెలలో తిరిగి ఎన్నికైన మమతా బెనర్జీ.. తాజాగా పార్టీ విధేయులతో నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుబత్రా బక్షీని నియమించగా, సెక్రటరీ జనరల్గా పార్థా ఛటర్జీని ఎంపిక చేశారు. వీరితోపాటు 20మంది ఉపాధ్యక్షులు, 19మంది జనరల్ సెక్రటరీలను నియమించారు. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడమే లక్ష్యంగా కొత్తగా కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ, ప్రభుత్వంలో సీనియర్ నేతలు ఒకటి కంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తుండడంపై దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మద్దతుగావున్న యువ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ మమతా బెనర్జీ సీనియర్లవైపే మొగ్గు చూపడం విశేషం.
హాజరైన ప్రశాంత్ కిశోర్..
మరోవైపు కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కూడా హాజరయ్యారు. కొందరు తృణమూల్ నేతలకు ప్రశాంత్ కిశోర్ బృందానికి (ఐప్యాక్) మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వస్తోన్న సమయంలో పీకే ఈ సమావేశంలో పాల్గొనడం కీలకంగా మారింది. మరోవైపు, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దిశగా పలు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమికి విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.