Telangana News: ఒవైసీ మెప్పుకోసమే కేటీఆర్‌ అలా మాట్లాడుతున్నారు: లక్ష్మణ్‌

మత రాజకీయాలు నడుపుతున్నారంటూ తమపై మంత్రి కేటీఆర్‌ ఆరోపణలు చేస్తున్నారని.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మెప్పుకోసమే ఆయన అలా మాట్లాడుతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు.

Updated : 20 Apr 2022 13:59 IST

హైదరాబాద్‌: మత రాజకీయాలు నడుపుతున్నారంటూ తమపై మంత్రి కేటీఆర్‌ ఆరోపణలు చేస్తున్నారని.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మెప్పుకోసమే ఆయన అలా మాట్లాడుతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. హిందువులపై దాడులు జరుగుతుంటే తెరాస ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన ఆరోపించారు.

నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ఒవైసీ డైరెక్షన్‌లోనే తెరాస ప్రభుత్వం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పాతబస్తీలో మజ్లిస్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేయలేని దుస్థితి తెరాస ప్రభుత్వానిదని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని