TS News: కాంగ్రెస్ నాయకత్వం, పంజాబ్ సీఎం కలిసి కుట్ర పన్నారు: మురళీధర్రావు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకత్వం, ఆ రాష్ట్ర సీఎం కలిసి కుట్ర పన్నారని భాజపా జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకత్వం, ఆ రాష్ట్ర సీఎం కలిసి కుట్ర పన్నారని భాజపా జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జి మురళీధర్రావు ఆరోపించారు. ప్రధాని భద్రతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ బహిరంగసభ గురించి మాట్లాడుతుందని ఆయన హైదరాబాద్లో విమర్శించారు. ప్రధాని భద్రతపై ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్ర సీఎం, సీఎస్, డీజీపీ వెళ్లి స్వాగతం పలకాల్సి ఉందని గుర్తు చేశారు. కానీ, ప్రధాన మంత్రి వెళితే ఈ ముగ్గురిలో ఒక్కరూ వెళ్లలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని భద్రత, దేశ సరిహద్దు విషయంలో భాజపా ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం