KCR: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్, ప్రవీణ్ కుమార్
లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయనతో ప్రవీణ్ కుమార్ చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది, విధివిధానాలు త్వరలో వెల్లడిస్తామని కేసీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.