Chandrababu: ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలు: చంద్రబాబు

ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 11 Apr 2024 11:35 IST

అమరావతి: ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో తెదేపా నేత మోహన్‌రావుపై వైకాపా దాడిని ఆయన ఖండించారు. ‘‘రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా? తెదేపా కార్యకర్త ప్రభావతి కుటుంబాన్ని వైకాపా రౌడీమూక చంపేస్తామని బెదిరించింది. ఆమెకు అండగా నిలిచిన తెదేపా నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారు. ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్తే అక్కడా బీభత్సం సృష్టించారు. దాడి సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ఈసీ దృష్టి పెట్టాలి. దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు