మోదీజీ ‘నమస్తే ట్రంప్’ మళ్లీ ఎప్పుడు?
తన ప్రియ నేస్తమైన ట్రంప్ గౌరవార్ధం మోదీ మరో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు?
భారత్పై ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో చిదంబరం చురకలు
ఇంటర్నెట్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం నరేంద్ర మోదీ మరో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని చిదంబరం ప్రశ్నించారు. కొవిడ్-19కి సంబంధించి భారత్ గణాంకాల విశ్వసనీయతపై అమెరికా అధ్యక్షుడు సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. భారత్, రష్యా, చైనా వంటి దేశాలు కరోనా వైరస్ మరణాల సంఖ్యలను బయట పెట్టవని మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి చర్చలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
‘‘మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ భారత్ను చైనా, రష్యా వంటి దేశాలతో కలిపారు. ఈ మూడు దేశాలు కొవిడ్ మరణాల సంఖ్యను దాచిపెడతాయని ఆరోపించారు. అంతేకాకుండా ఆయా దేశాలే అత్యధిక వాయు కాలుష్యానికి కారణమని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో తన ప్రియ నేస్తమైన ట్రంప్ గౌరవార్థం మోదీ మరో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు?’’ అని చిదంబరం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!