Gehlot Vs Sachin: ఆధిపత్య పోరు మళ్లీ షురూ.. తన పనితీరు వల్లే గెలిచామన్న గహ్లోత్
రాజస్థాన్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యిందని సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరోక్షంగా ఖండించారు. తాను గతంలో చేసిన అభివృద్ధి వల్లే 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
జైపుర్: రాజస్థాన్ కాంగ్రెస్లో వర్గపోరు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot)ల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. తాను 2013-2018 మధ్యకాలంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు పార్టీ నాయకుల కృషి వల్లే క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఖండించారు. తాను గతంలో చేసిన అభివృద్ధి వల్లే 2018లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 156 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
2013లో ఎమ్మెల్యేల సంఖ్య 21గా ఉండగా.. పార్టీ హైకమాండ్ తనను పీసీసీ చీఫ్గా చేసిన తర్వాత ఈ సంఖ్య పెరిగిందని సచిన్ పైలట్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పార్టీలో వయసు పైబడుతున్న నాయకులు యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా వీటిపై పరోక్షంగా స్పందించిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. మోదీ వేవ్ వల్లే 2013లో తాము భారీ ఓటమి చెందామన్నారు. అయితే, కేవలం ఆరు నెలల్లోనే ప్రజలు తమ తప్పిదాన్ని తెలుసుకున్నారని.. ఈసారి మాత్రం అలా జరగదన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మరికొన్ని నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అగ్ర నేతల మధ్య ఇలా ఆధిపత్య పోరు మళ్లీ మొదలవ్వడం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇబ్బంది కలిగించే విషయంగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.