Rajasthan: అశోక్ గహ్లోత్కు ఆర్ఎస్ఎస్ అంటే భయం: రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీజోషీ (CP Joshi) మండిపడ్డారు. ఆయనకు ఆరెస్సెస్ (RSS) అంటే భయమని విమర్శించారు.
జైపుర్: రాజస్థాన్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) గురువారం చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ (CP Joshi) మండిపడ్డారు. గహ్లోత్కు ఆరెస్సెస్ (RSS) అంటే భయమని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదులను గౌరవించడం, దేశభక్తులను దూషించడం వల్లే కాంగ్రెస్ పతనమైందని దుయ్యబట్టారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తనను నిరంకుశుడు (fascist) అని నిందిస్తున్నారని.. అందువల్ల ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలని చురకలు వేశారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం గహ్లోత్ స్పందించారు. భాజపా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లపై విరుచుకుపడ్డారు. ‘‘భాజపా (BJP), ఆరెస్సెస్ నేతలు నిరంకుశులు. వారు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను పడగొట్టారు. రాజస్థాన్లో బలమైన ప్రభుత్వం లేకపోతే మనకూ అదే పరిస్థితి వచ్చేది. ఇలాంటి వారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలి’’ అని విమర్శించారు. దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ ఘాటుగా స్పందించారు.
‘‘కాంగ్రెస్కు ఆరెస్సెస్ అంటే భయం. అందుకే వారు ఆ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అరెస్సెస్ కార్యకర్తలు వివక్ష లేకుండా ఓ సైన్యం వలే సమాజాన్ని రక్షించడానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే అంకితమై ముక్కలైపోయిన సంస్థ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గహ్లోత్ భయపడుతున్నారు. రాహుల్ గాంధీ దృష్టిలో పడేందుకే ఆయన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని జోషీ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం