Congress: సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు!
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీని ప్రకటించింది. మొత్తం 84మందితో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం దక్కింది.
దిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్(Congress) సంస్థాగతంగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించింది. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. 18 మందిని CWC శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇంఛార్జిలుగా, తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురిని ఎక్స్అఫిషియో సభ్యులుగా పేర్కొంది. కాంగ్రెస్లో అసమ్మతి వర్గంగా పేరొందిన జీ23 నేతలైన శశిథరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ వంటి నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. సచిన్ పైలట్తో పాటు దీపా దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్లను కొత్తగా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు.
సీడబ్ల్యూసీ సభ్యులు వీళ్లే..
సీడబ్ల్యూసీ సభ్యులుగా మొత్తం 39మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌధురి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, తారిక్ అన్వర్, లాల్ తాన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్ చవాన్, అజయ్ మాకెన్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్జా, గైఖంగం, ఎన్. రఘువీరారెడ్డి, శశిథరూర్, తమ్రాద్వాజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖుర్షిద్, జైరాం రమేశ్, జితేంద్ర సింగ్, రణ్దీప్ సూర్జేవాలా, సచిన్ పైలట్, దీపక్ బబారియా, జగదీశ్ ఠాకూర్, జి.ఎ.మీర్, అవినాశ్ పాండే, దీపా దాస్ మున్షి, మహేంద్రజీత్ సింగ్ మాలవీయ, గౌరవ్ గొగొయి, సయ్యద్ నసీర్ హుస్సేన్, కమలేశ్వర్ పటేల్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనవారు..
తెలుగు రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ జనరల్ సభ్యుల జాబితాలో ఏపీ నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఒక్కరికే ఛాన్స్ లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కింది. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డిలను ఎంపిక చేశారు. గతేడాది అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ(CWC) స్థానంలో 47మందితో తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరిస్తూ ఆదివారం జాబితాను విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా