Andhra News: మోదీ ఆదేశాలతో కేటీఆర్ మాట మార్చారేమో..: సీపీఐ నారాయణ
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీపై చేసిన వ్యాఖ్యలను రాత్రికిరాత్రే మార్చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
రాజమహేంద్రవరం: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీపై చేసిన వ్యాఖ్యలను రాత్రికిరాత్రే మార్చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేటీఆర్ మాట మార్చేశారేమో అని ఆరోపించారు. రహదారుల పరిస్థితిని నగరిలో తాను ప్రత్యక్షంగా చూపించినట్లు వివరించారు. నా వీడియో చూసి రోడ్లు బాగుచేయాలని మంత్రి రోజా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు నారాయణ తెలిపారు.
మేడే సందర్భంగా రాజమహేంద్రవరంలో పర్యటించిన నారాయణ మీడియాతో మాట్లాడారు. సమస్య గురించి చెబితే సరిదిద్దుకునే విధానం ఉండాలని చెప్పారు. నిన్న దిల్లీలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విలువైన సూచనలు చేసినట్లు నారాయణ వివరించారు. న్యాయవ్యవస్థలో ముందుగా దేశద్రోహం చట్టం రద్దు చేయాలని కోరారు. కోర్టు ధిక్కరణ కేసులు ప్రభుత్వం నుంచే ఎక్కువ అని నారాయణ అన్నారు. కోర్టు ధిక్కరణ సీఎంలలో జగన్ నెంబర్ వన్ అని.. తెలంగాణ నుంచి సీఎస్ నెంబర్వన్ అని ఆయన ఆరోపించారు.
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని కేటీఆర్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై పోటాపోటీగా విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని, జగన్ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని కేటీఆర్ మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో ట్వీట్ చేశారు. కేటీఆర్ ఏపీపై చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవిస్తున్నట్లు నారాయణ నిన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ, తమిళనాడులో రోడ్ల పరిస్థితిని వీడియోల ద్వారా వివరించిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో తాజాగా దీనిపై కూడా నారాయణ స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం