అధికారంలోకొస్తే విద్యా రుణాలు రద్దు: స్టాలిన్
తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే హామీల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే.....
ఈరోడ్: తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే హామీల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలోని ఓ గ్రామసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికార అన్నాడీఎంకే పార్టీపైనా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూరు రోజుల పనిదినాలు కల్పించడంలోనూ దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో పనిదినాల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించారు. అలాగే ఉపాధి హామీ పనిదినాలను 150కి పెంచాలని కేంద్రాన్ని కోరతానని స్టాలిన్ చెప్పారు.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్లకు అనుమతిపై కాంగ్రెస్ భిన్న వాదనలు
రామతీర్థం ఘటనలో 12 మంది అరెస్ట్: ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?