Fuel Prices: ప్రతి నెలా ఎన్నికలు జరగాలేమో.. ఇంధన ధరల పెంపుపై ఎంపీ వ్యంగ్యాస్త్రాలు
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్రంలోని
దిల్లీ: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. కేవలం ఎన్నికలే వీటి ధరలను కంట్రోల్ చేయగలవంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఇంధన ధరల పెంపును ఎన్నికలే ఆపగలవు. ప్రతి నెలా ఎన్నికలు జరగాలి. అప్పుడైనా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగకుండా ఉంటాయి’’ అని సుప్రియ లోక్సభలో అన్నారు.
ఇదిలా ఉండగా.. చమురు ధరల పెంపుపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో విపక్షాలు వరుసగా నినాదాలు చేస్తుండటంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్సభలోనూ ఇదే గందరగోళం నెలకొంది.
దాదాపు నాలుగు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా ఈ ధరల పెంపు కొనసాగింది. రెండు రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధర రూ.1.60 పెరగడం గమనార్హం. అటు వంట గ్యాస్ సిలిండర్పైనా రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.