Jithender Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

భాజపా నేత, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 15 Mar 2024 22:16 IST

హైదరాబాద్‌: భాజపా నేత, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ .. కాంగ్రెస్‌ కండువా కప్పి జితేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్‌రెడ్డికి భాజపా అవకాశం కల్పించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనను పదవి వరించింది. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు)  నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు