రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర భాజపా నేతలు గురువారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నడ్డాకు ఈ సందర్భంగా వపన్ శుభాకాంక్షలు
దిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర భాజపా నేతలు గురువారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈ సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఇరుపార్టీల కార్యాచరణపై పవన్ ..నడ్డాకు వివరించారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్, భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వైకాపా నేతలు ఎప్పుడూ రాజధాని అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లలేదని జేపీ నడ్డా కూడా స్పష్టం చేసినట్లు పవన్ తెలిపారు. ‘‘రాజధాని మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, హోం మంత్రి అంగీకారం లేదు. వైకాపా నేతలు వారి భూ దందాల కోసమే రాజధానిని మార్చాలని చూస్తున్నారు. వారి స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఫిబ్రవరి 2న భాజపా, జనసేన సంయుక్తంగా రాజధాని రైతులకు మద్దతుగా , ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం లాంగ్ మార్చ్ నిర్వహించబోతున్నాం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?