నరేంద్ర మోదీ సింహం లాంటి వారు...
మోదీ రాముడైతే, అమిత్ షా హనుమంతుడని మధ్యప్రదేశ్ మాజీముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
దిల్లీ: నరేంద్ర మోదీ సింహం లాంటి వారని, ఆయన ప్రభుత్వం ఏ విధమైన బెదిరింపులకు లొంగదని మధ్యప్రదేశ్ మాజీముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును ఎవ్వరూ అడ్డుకోలేరని కూడా చౌహాన్ అభిప్రాయపడ్డారు. దిల్లీలోని మటియాలా నియోజక వర్గంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న చౌహాన్ ‘‘ప్రపంచంలోని ఏ శక్తీ పౌరసత్వ సవరణ చట్టం అమలుకు ఆటంకం కలిగించలేదు. నరేంద్ర మోదీ సింహం లాంటి వారు. ఆయన ఏ బెదిరింపులకు లొంగని ప్రధాని. నరేంద్ర మోదీ రాముడైతే, అమిత్ షా హనుమంతుడి వంటి వారు.’’ అని ప్రసంగించారు.
అసలు సీఏఏలో భారతీయ ముస్లింలను బయటకు పంపిస్తామని ఎక్కడ ఉందో చెప్పాలని ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సవాల్ విసిరారు. వారు ఓట్ల కోసం పుకార్లను ప్రచారం చేస్తున్నారని, వారి పార్టీ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్