జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్పై కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ మెట్రోరైల్ మొదటి దశలో చివరిదైన జూబ్లీ బస్స్టేషన్ (జేబీఎస్) నుంచి మహాత్మా గాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్) కారిడార్ ప్రారంభోత్సవంతో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ మెట్రోరైల్ అభివృద్ధి చెందుతుందని...
హైదరాబాద్: మెట్రోరైల్ మొదటి దశలో చివరిదైన జూబ్లీ బస్స్టేషన్ (జేబీఎస్) నుంచి మహాత్మా గాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్) కారిడార్ ప్రారంభోత్సవంతో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ మెట్రోరైల్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల ఏడో తేదీన మెట్రో మూడో కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైల్, పోలీసు అధికారులతో ప్రగతి భవన్లో ఆయన సమీక్షించారు. కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని.. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ఈ కారిడార్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పీపీపీ పద్ధతిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైల్ ప్రాజెక్టు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అందుకున్న మైలురాళ్లు, అవార్డులు, ఇతర విశేషాలు ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. మెట్రోరైల్ ప్రాజెక్టు సమగ్ర వివరాలు, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, గణాంకాలతో కూడిన వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
ఇది చదవండి..
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో.. 7న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.