సీఏఏతో మైనారిటీలకు ఏమీ కాదు: పళనిస్వామి
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో డీఎంకే పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. 2020-21 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో సీఏఏపై వాడీవేడీ చర్చ జరిగింది.
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో డీఎంకే పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. 2020-21 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో సీఏఏపై వాడీవేడీ చర్చ జరిగింది. డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే టి మనో తంగరాజ్ మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి పళనిస్వామి జోక్యం చేసుకుని... సీఏఏ వల్ల భారత్లోని మైనారిటీలపై ఉండే ప్రభావం ఏమిటో వివరించాలని డీఎంకే నాయకులను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ మైనారిటీలకు నష్టం కలిగించే చట్టాల్ని అనుమతించదని చెప్పారు. ‘సీఏఏ కారణంగా తమిళనాడులో ఏ మైనారిటీ వర్గంపై ప్రభావం పడుతుందో చెప్పాలని ప్రశ్నిస్తూ.. మేము మీ లాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించం’ అని విమర్శించారు. ఈ క్రమంలో తంగరాజ్ మళ్లీ స్పందిస్తూ.. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దానికి సీఎం స్పందిస్తూ.. ‘పౌరసత్వ సవరణ చట్టం కేంద్రం పరిధిలో ఉంటుంది.. దానితో రాష్ట్రాలకు సంబంధం ఉండదు’ అంటూ బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.