ఇక హత్య కేసునూ బెయిలబుల్గా మార్చండి!
జగన్ సీఎంగా ఉన్నంత కాలం హత్య కేసును బెయిలబుల్గా మార్చి.. 41ఏ నోటీసుతో సరిపెట్టేలా చట్టసవరణ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావులు ఎద్దేవా చేశారు.
తెదేపా నేతలు వర్ల, బొండా ఎద్దేవా
ఈనాడు డిజిటల్, అమరావతి: జగన్ సీఎంగా ఉన్నంత కాలం హత్య కేసును బెయిలబుల్గా మార్చి.. 41ఏ నోటీసుతో సరిపెట్టేలా చట్టసవరణ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావులు ఎద్దేవా చేశారు. ప్రజాసేవ చేయడంలో విఫలమైన జగన్..తన అధికారం, అవినీతి సొమ్మును ఉపయోగించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు అవినాష్రెడ్డిని కాపాడటంలో సఫలమయ్యారని మండిపడ్డారు. అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పున:సమీక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ దిల్లీ పర్యటనలు విజయవంతమయ్యాయి. అధికార బలం, అవినీతి సొమ్ము ఉన్న పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయంలా రాష్ట్రంలో పరిస్థితులు మారాయి’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?