నేడు ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు రానున్నారు.

Published : 06 Jun 2023 04:52 IST

14వసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో సన్మానం

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు రానున్నారు. పార్టీ అధ్యక్షుడిగా 14వసారి ఎన్నికైన సందర్భంగా తెలంగాణ నేతలు చంద్రబాబును సన్మానించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు ఎన్టీఆర్‌ భవన్‌కు వస్తున్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని