ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు
ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా
బీఎస్పీ నేతల చేరిక సందర్భంగా భారాస అధినేత కేసీఆర్
ఈనాడు- హైదరాబాద్, న్యూస్టుడే, గజ్వేల్: ‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పలువురు నాయకులు, అభిమానులతో సహా సోమవారం భారాస పార్టీలో చేరారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ గులాబీ కండువా కప్పి ప్రవీణ్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అగాధంలో ఉన్న తెలంగాణకు భారాస పాలనలో ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇవి ఎక్కడికీ పోవు.. కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎక్కువిస్తుందేమోనని ఆశతో ప్రజలు మోసపోయారు. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు. గాడిద వెంట పోతేనే కదా.. గుర్రాల విలువ తెలుస్తుంది’’ అని అన్నారు.
దళితబంధుపై విశ్లేషించాలి...
కేసీఆర్ మాట్లాడుతూ..‘‘కోటానుకోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసిన వాళ్లు. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. ఈమధ్య నిర్వహించిన సమీక్షల్లో మన వాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించాయి. దళితబంధు పథకంతో మనకు దెబ్బపడ్డదని అంటున్నారు. కానీ అలాంటి ఆలోచన సరికాదు. దళితబంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి. దళిత సమాజం దీన్ని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలి. దళిత, బహుజన శక్తి కలిసిపోవాలనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాడారు. దాన్ని మనం కొనసాగించాలి. పాలకులపై ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలి. అగ్రవర్ణాల్లోని పేదలను కూడా కలుపుకొనిపోవాలి. 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదేమీ లేదు.
శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించాం...
రాజకీయాల్లో ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని, నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్నన్ని తిట్లు ఎవరూ తినలేదు. రూ.5వేల కోట్లు ఇస్తామని సమైక్యవాదులు ప్రలోభాలు పెట్టినా.. తెలంగాణ వాదాన్ని వదల్లేదు. శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించాం. ఇటువంటి సమస్యలెన్నో చూశాం. ఇదో లెక్కకాదు. మీలాంటి యువ నాయకత్వం ఎదిగితే.. ఈ వచ్చిపోయే చిల్లర, స్వార్థపరుల అవసరం ఉండదు. ఉద్యమకాలంలో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప.. మరీ ఇలా అసభ్యంగా బూతు కూతలకు దిగలేదు. మనం ఇచ్చిన నీళ్లు, కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మనం కష్టపడితే.. 100 శాతం అద్భుతమైన విజయం సాధిస్తాం’’ అని కేసీఆర్ అన్నారు. భారాస పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్కుమార్ను త్వరలోనే ప్రకటిస్తానని.. భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉంటారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.
ఒత్తిడి తెచ్చినా నిర్ణయం మార్చుకోలేదు: ప్రవీణ్కుమార్
భారాసలో చేరిన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. ‘‘పొత్తు రద్దు చేసుకొమ్మని మాయావతి నాపై ఒత్తిడి తెచ్చారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే భారాసలో చేరాలని నిర్ణయించుకున్నా. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు కానీ సైద్ధాంతికంగా కాదు. రాష్ట్రమంతా తిరిగి బహుజనవాదాన్ని ప్రచారం చేస్తాం. నేను ఎటువంటి ప్యాకేజీలకూ లొంగేవాడిని కాదు. నేను ఏమీ ఆశించి భారాసలో రాలేదు. అలా ఆశించే వాడిని అయితే కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లేవాడిని. సీఎం రేవంత్రెడ్డి నన్ను సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో నేనూ ఒక్కణ్ని కాలేను. సీఎం రేవంత్రెడ్డి నాకు టీఎస్పీఎస్సీ పదవి ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే. నేను తిరస్కరించాను’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్