శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు.
వీరాంజనేయులును మార్చాలని డిమాండ్
శింగనమల, బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం శింగనమల మండలంలోని శివపురం పెద్దమ్మ ఆలయం వద్ద పార్టీ అసమ్మతి నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆరు మండలాలనుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు చేతులెత్తి దండం పెట్టి అభ్యర్థిని మార్చాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబ పాలన సాగింది. కుటుంబసభ్యులకు మండలాలవారీ పెత్తనమిచ్చి పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ అయిదేళ్లు మండలాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. సాంబశివారెడ్డి మరోసారి పెత్తనం చెలాయించేందుకు తనకు అనుకూలమైన అభ్యర్థిని తీసుకొచ్చారు’ అని మండిపడ్డారు. సాంబశివారెడ్డి సూచించిన వీరాంజనేయులును అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు చామలూరు రాజగోపాల్, మిద్దె కుళ్లాయప్ప, నార్పల సత్యనారాయణరెడ్డి, వంశీగోకుల్రెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, చెన్నంపల్లి రాజశేఖర్రెడ్డి, బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
అడుగడుగునా అడ్డంకులు
అనంతపురంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశాన్ని నిర్వహించాలని వైకాపా అసమ్మతి నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘ఆలూరు సాంబశివారెడ్డి అధికారాన్ని వినియోగించి సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. బుక్కరాయసముద్రం, నార్పల, శింగనమలలో చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేయించి అనంతపురం వెళ్లకుండా నిలువరించారు. ఫంక్షన్హాల్ను జప్తు చేయిస్తామని అధికారులతో యజమానిని భయపెట్టించారు’ అని అసమ్మతి నాయకులు వాపోయారు. శివపురం పెద్దమ్మ ఆలయం వద్దకు నాయకులు, కార్యకర్తలు వెళ్లగా అక్కడికి దేవాదాయ శాఖ అధికారులను పంపి సమావేశం అడ్డుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్