ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి

సమస్యలు తీర్చాలని అర్జీలిచ్చి అడుక్కోకుండా.. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ పేర్కొన్నారు. ఒంగోలులో ‘ప్రకాశం నామకరణ

Published : 03 Jul 2022 05:35 IST

లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: సమస్యలు తీర్చాలని అర్జీలిచ్చి అడుక్కోకుండా.. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ పేర్కొన్నారు. ఒంగోలులో ‘ప్రకాశం నామకరణ స్వర్ణోత్సవాల’ సందర్భంగా శనివారం నిర్వహించిన ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటు విలువను తెలుసుకొని సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తరచూ అర్జీలు ఇచ్చి అడుక్కున్నే పరిస్థితి తెచ్చుకోకుండా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. అలాకాని పక్షంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పట్టణీకరణ అవసరమేనని, అయితే పట్టణాల్లోనే అన్నీ ఉంటాయనే భావనతో వలస పోకూడదని సూచించారు. 25 వేల జనాభాకు ఒక గ్రామాన్ని ఏర్పరుచుకొని స్థానిక నాయకత్వంతో అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. సభలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, పుస్తక రచయిత సంజీవరావు, లయోలా కళాశాల రిటైర్డ్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ గుమ్మా సాంబశివరావు, రచయిత పాటిబండ్ల ఆనందరావు, ప్రముఖ వైద్యులు చుంచు చలమయ్య, ఉన్నం జ్యోతి వాసు, సూర్యకుమారి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని