వైఎస్సార్సీపీ పేరును ఆటాడుకుంటున్న నెటిజన్లు: రఘురామ
వైఎస్సార్సీపీకి పర్యాయపదం పెట్టి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఈనాడు, దిల్లీ: వైఎస్సార్సీపీకి పర్యాయపదం పెట్టి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నా ఆయా వర్గాలకు ఏమీ చేయకుండా నిండా ముంచేశామన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు ఎలాగూ జరగదని, కానీ మూడు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు శృంగార పీఠాలు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. అందులో ఒకరు పల్నాటి పులి, మరొకరు విశాఖ వీరుడు, ఇంకొకరు రాయలసీమ సింహం అన్నారు. ఎంపీ మాధవ్పై చర్యలు తీసుకుంటే పెద్ద పదవుల్లోని మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రముఖుల వీడియోలు మరో మూడు, నాలుగు వెలుగులోకి వస్తాయని తమ పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన వ్యక్తి వెల్లడించారన్నారు. మాధవ్పై చర్యలు తీసుకోవాలని రోడ్లపై దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నా సీఎం జగన్ చర్యలకు వెనుకాడుతున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్