Rajagopal Reddy: నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇస్తా: రాజగోపాల్‌రెడ్డి

శాసనసభాపతిని కలిసి సోమవారం తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం

Updated : 08 Aug 2022 08:12 IST

చండూరు, న్యూస్‌టుడే: శాసనసభాపతిని కలిసి సోమవారం తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. స్పీకర్‌ను కలిసే అవకాశం ఇవ్వకుంటే కొన్ని రోజులు వేచి చూసి నేరుగా అసెంబ్లీ కార్యదర్శితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి తన రాజీనామా పత్రాన్ని పంపిస్తానని చెప్పారు. ‘‘మూడున్నర ఏళ్లుగా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవటంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్‌ పురపాలికల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. అదే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ పురపాలికలను అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. అది ఇక్కడి ప్రజలకు అర్థం కావటానికి త్వరలో బస్సులు ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్తా. నా రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు